కరోనా వైరస్ ఎవర్ని వదిలిపెట్టడం లేదు. టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే నిర్మాత బండ్ల గణేష్ వైరస్ పాజిటివ్ గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సమంతకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్ప రెడ్డికి వైరస్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఇటీవలే ఈమె కాస్త అనారోగ్యంగా ఉండటంతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. శిల్పకు పాజిటివ్ నిర్థారణ అవ్వడంతో సమంత ఫ్యాన్స్ ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు.
ఇటీవలే సమంత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోలో శిల్ప రెడ్డిని ఏకంగా ముద్దు పెడుతూ సమంత కనిపించింది. వీరిద్దరి స్నేహంకు ఆ ఫొటో గుర్తుగా చెప్పుకోవచ్చు. అంతటి క్లోజ్ గా ఉన్న వీరిద్దరు వైరస్ ను కూడా షేర్ చేసుకున్నారా అనే ఆందోళన ప్రస్తుతం వ్యక్తం అవుతోంది. శిల్ప రెడ్డికి వైరస్ ఎప్పటి నుంచి ఉందో తెలియని పరిస్థితి. ఇటీవలే ఆమె సమంతను కలిసింది. అంతేకాకుండా క్లోజ్ గా కనిపించారు.
శిల్ప రెడ్డికి వైరస్ ఉండి ఉంటే ఖచ్చితంగా సమంతకు కూడా వచ్చి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. శిల్ప కాంటాక్ట్ జాబితాలో సమంత ఉంటుంది కనుక సమంత కూడా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకుంటే బేటర్ అని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతానికి సమంత పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయినా కూడా ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.
బిగ్బాస్ 4లో యాంకర్ వర్షిణి.. క్లారిటీ ఇచ్చింది..!
రానా, మిహీక ఫస్ట్ టైం ఎక్కడ కలుసుకున్నారో తెలుసా ?
సుధీర్ అంటే చాలా ఇష్టం.. సుధీర్ గురించి చెప్పిన విష్ణుప్రియ..!