ఇటీవల కాలంలో బుల్లితెర మీద బాగా ఫేమస్ అయింది ఎయిర్టెల్ గర్ల్ సాషా చెత్రీ. ప్రతి ఒక్కరిగి రిజస్టర్ అయ్యే విధంగా తన మాటలతో ఓ 4జీ సిమ్కు యాడ్ చేసింది ఈ భామ.ఈ యాడ్ పుణ్యమా అని సాషా చెత్రీ సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.ఆమె తెలుగులో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.మొదటి సినిమా విడుదల కాకుండానే రెండో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో చేస్తుంది సాషా చెత్రీ.ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా సాహో.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సాషా చెత్రీని తీసుకున్నారని తెలుస్తుంది. ప్రభాస్ కు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ నటిస్తున్న విషయం తెల్సిందే. సాషా చెత్రీ బాలీవుడ్లో బాగానే ఫేమస్ అయింది. సాషాని సాహోలో తీసుకుకోవడం ద్వారా సినిమాకు ఆమె హెల్ప్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.రన్ రాజా రన్ ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.వచ్చే ఏప్రిల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.