Saturday, April 27, 2024
- Advertisement -

సుమ క్యాష్ షోలో విశ్వక్ సేన్ బూతులు.. వీడియో వైరల్..!

- Advertisement -

తెలుగు బుల్లితెరపై ఎంత మంది యాంకర్స్ ఉన్నప్పటికి సుమకు ఉన్న క్రేజ్ మరో యాంకర్ లేదని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. రష్మీ, శ్రీముఖి, అనసూయ తమ హాట్ అందాలతో లాక్కొస్తున్నప్పటికి సుమ మాత్రం తన మాటలతో జనాలను ఎంటర్‍టైన్ చేస్తోంది. గత పదిహేను ఏళ్లుగా యాంకర్ గా కొనసాగుతోంది. అయితే గత కొంత కాలంగా ఆమె షోలలో కూడా ద్వందర్దాలు, బూతు డోస్ ఎక్కువైంది.

తాజా సుమ హోస్ట్ గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. ఇందులో ఫలక్‌నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్‌తో పాటు కమెడియన్ మహేష్, అభినవ్ గోమఠం, హీరోయిన్ సిమ్రన్‌లు గెస్ట్‌లుగా పాల్గొన్నారు. గెస్ట్‌గా వచ్చిన విశ్వక్ సేన్‌కి తాంబూలం ఇచ్చి స్వాగతం పలికింది సుమ. తాంబూలం తీసుకుని తింటున్న విశ్వక్ సేన్ దేనికి తింటున్నా.. ఇది అనడంతో ‘నాకూ తెలియదు వాళ్లు పెట్టారు.. తింటున్నా’ అంటూ పంచ్‌తో ప్రోమో మొదలుపెట్టింది సుమ.

ప్రోగ్రామ్‌లో భాగంగా మహేష్, అభినవ్‌లను ‘ఏదేశం వాళ్లు రబ్బరు టైర్‌ని మెయిన్ క్యారెక్టర్‌గా పెట్టి సినిమా తీశారు’? అని క్వచ్ఛన్ వేయడంతో.. ‘మేడమ్ ఏదోటి సింపుల్‌గా అడగండి మేడమ్’ అని అభినవ్ అనడంతో ‘నన్ను మేడమ్ అని అనొద్దన్నానుగా.. మీకు నాకు మహా అయితే 1-2 ఏళ్లు డిఫరెన్స్ అంతే.. అంటూ ఫీల్ అయ్యింది సుమ. దీనికి కౌంటర్ ఇచ్చిన మహేష్.. ఆ రెండేళ్లు కూడా మాకంటే మీరే చిన్నవాళ్లు’ రివర్స్ పంచ్ వేశాడు.

అయితే విశ్వక్ నటించిన ఫలక్‍నుమా దాస్ సినిమాలో బూతులు అప్పట్లో బాగా హైలైట్ అయ్యాయి. ఈ చిత్రంల్ని బూతు డైలాగ్ ను విశ్వక్ సేన్ క్యాష్‌ షోలో సుమ ముందు చెప్పి ఆమె చెవులు మూసుకునేలా చేశాడు. ఈ షోకి వచ్చిన స్టూడెంట్స్ అందరితోనూ ఈ బూతు రోతను మాట్లాడిస్తూ అందరు నవ్వుకునేలా చేశాడు విశ్వక్ సేన్. మీరు కూడా ఆ ప్రోమో చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -