Saturday, April 27, 2024
- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ‌లో మ‌రో అసెంబ్లీ

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ‌లో మ‌రో అసెంబ్లీ ఏంటీ అనుకుంటున్నారా! అవునండీ మీరు విన్న‌ది నిజ‌మే ..ఆంధ్ర‌ప్ర‌దేశ‌లో మ‌రో అసెంబ్లీ క‌ట్ట‌బొతున్నారు. ఇది అమ‌రావ‌తిలో కాదు వైజాగ్‌లో. అమ‌రావ‌తిలో ఉన్న అసెంబ్లీకే ప్ర‌తిప‌క్షం అయిన వైఎస్ఆర్‌సిపీ రావ‌డం లేదు.ఇంకా రెండో అసెంబ్లీ వైజాగ్‌లో ఎందుకు అనే క‌దా మీ డౌట్‌.అయితే ఇక్క‌డ క‌ట్ట‌బోతున్న అసెంబ్లీ రాజ‌కీయ పార్టీల‌ కోసం కాదు.మ‌హేష్ బాబు సినిమా కోసం.మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ డ్రాప్ సినిమా అయిన భ‌ర‌త్ అను నేను సినిమా చేస్తున్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే.ఈ సినిమా ప్రీ రీలిజ్ ఈవెంట్ ఫంక్ష‌న్ వైజాగ్‌లో చేయ‌ల‌ని చిత్ర యూనిట్ నిర్ణ‌యించారు. ప్రీ రీలిజ్ ఈవెంట్‌ను మామూలు సినిమా ఫంక్ష‌న్‌లా కాకుండా ఓ రాజ‌కీయ వేదిక‌గా జ‌ర‌పాల‌ని భావిస్తుంది చిత్ర బృందం. అందుకోసం వైజాగ్‌లో అసెంబ్లీని నిర్మించాల‌ని భావిస్తున్నారు.

దీనికి సంబందించిన ప‌నులు కూడా ప్రారంభ‌మైనట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో మ‌హేష్ బాబు సీఎంగా న‌టిస్తున్నారు.కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌తంలో శ్రీమంతుడు సినిమా వ‌చ్చి ఇండ‌స్ట్రీ రికార్డుగా నిలిచింది.ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్‌గా నిలుస్తుంద‌ని మ‌హేష్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వాని మహేష్ ప‌క్క‌న చేస్తుంది. ఈ సినిమా ప్ర‌ధానంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ‌ల‌కు సంబందించినది తెలుస్తుంది.ఏప్రిల్ 20న సినిమా విడుద‌ల‌కు రెడీ గా ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -