అజ్ఞాతవాసి సినిమా 2018లో విడుదలైంది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు దూరమ్గా ఉన్నారు. దాంతో ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాల్లో ఎప్పుడు నటిస్తాడో అని ఎదురు చూశారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీని నిలబెట్టుకోవాలంటే ముందు తాను ఆర్థికంగా పరిపుష్ఠంగా ఉండాలని అర్థం చేసుకున్న పవన్.. ఆ క్రమంలో సినిమాలు చేయడం మొదలు పెట్టారు.
వకీల్ సాబ్
మూవీతో పవన్ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ మెజారిటీ షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. మెజారిటీ షూటింగ్ పూర్తయినా కరోనా మహమ్మారీ వల్ల అనూహ్యంగా పెండింగ్ షూట్ పూర్తి చేయడం కష్టమైంది. ఈపాటికే వకీల్ సాబ్ రిలీజ్ కావాల్సింది. మహమ్మారీ ఊహించని దెబ్బ కొట్టడంతో ఆలస్యమైంది. ఇందువల్ల.. పవన్, దిల్ రాజు కంటే ఫ్యాన్స్ ఎక్కువ నిరాశపడ్డారు.
ఇన్నాళ్లు ఆలస్యమైనందుకు అయినా కనీసం ఆ మూవీకి సంబంధించిన పోస్టర్లు టీజర్లు అయినా కళ్ల ముందుకు రావాలనేది ఫ్యాన్స్ కోరిక. కానీ అది కూడా సాధ్యం కావడం లేదు. అందుకే పవన్ ఫ్యాన్స్ లో నిరాశను అర్థం చేసుకుని ఎట్టకేలకు పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న టీజర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. తన అభిమానులకు పవన్ ఇచ్చే కానుక అది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
షూటింగ్లు చేయం అంటున్న సుమ, అనసూయ.. ఎందుకు ?
వర్మ ’పవర్ స్టార్’మూవీపై పవన్ కళ్యాణ్ రియాక్షన్..!