Friday, April 26, 2024
- Advertisement -

చిక్కుల్లో మాజీ మంత్రి అఖిలప్రియ ….భర్తపై హత్యాయత్నం కేసు నమోదు

- Advertisement -

టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ చిక్కుల్లో పడ్డారు. భర్త భార్గవ రామ్‌ వ్యాపార భాగస్వామిపై దాడికి పాల్పడిన ఘటనలో ఆళ్లగడ్డ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. భార్గవరామ్ వ్యాపార భాగస్వామి అయిన శివరామ రెడ్డికి కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురంలో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40శాతం వాటా ఉంది. కొన్ని రోజుల నుంచి వ్యాపారలావా దేవీల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వ్యాపారలావాదేవీల విషయంలోనే అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ తన భర్త శివరామిరెడ్డిపై హత్యాయత్నం చేశాడని ఆయన భార్య మాధవీలత ఆళ్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 14న భార్గవరామ్‌ తన అనుచరులతో కలిసి ఫ్యాక్టరీ వద్దకు వచ్చి తాళాలు వేశాడని, తమకు చెందిన మరో కంపెనీని కూడా స్వాధీనం చేసుకొని ఆయనపై పేరుపై రాయించుకునే ప్రయత్నం చేస్తున్నాడని మాధవీలత ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధవీ లత ఫిర్యాదు మేరకు పోలీసులు భార్గవ రామ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -