Saturday, April 27, 2024
- Advertisement -

క‌ర్నూలులో దారుణం..ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ఆత్మ‌హ‌త్య‌..

- Advertisement -

క‌ర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివ‌రాల్లోకి వెల్తే……కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు బుడగజంగం కాలనీలో వీరాంజనేయులు (35), వసంత(32) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె రామలక్ష్మీ(7), కుమారుడు రాజేశ్(5) ఉన్నారు. అయితే ఏక‌ష్టం వ‌చ్చిందో తెలియ‌దు గాని క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. ఇద్దరు కన్నబిడ్డలకు ఉరివేసి అనంత‌రం దంప‌తులుకూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

బుధవారం ఉదయం వారు ఇంటి నుంచి ఎప్పటికీ బయటకు రాకపోవడంతో పక్కంటివారికి అనుమానం వచ్చి పిలిచారు. ఎంత‌సేప‌టికి త‌ల‌పు తెర‌వ‌క‌పోడంతో కిటికీలో నుంచి చూడగా ఆంజనేయులు, వసంత వేలాడుతూ కనిపించారు. దీంతో దీంతో ఇరుగుపొరుగువారు తలుపులు బలవంతంగా తెరిచి లోనికి వెళ్లి చూసేసరికి వారు అప్పటికే మృతిచెందారు. ఆ పక్కనే చిన్నారులు విగత జీవులుగా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న అధికారులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. వీరి మృతికి కార‌ణాలు తెలియాల్సి ఉంద‌న్నారు అధికారులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -