2019 ఐపీఎల్ ఫీవర్ మొదలయ్యింది. త్వరలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లకోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానుల, ఫ్రాంచైజీల సందడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల వ్యవధికి బీసీసీఐ నిన్న షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆరంభం కానుంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ చెన్నైపై ట్వీట్ చేసింది. ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ‘దక్షిణాది రెబల్ జట్టుతో పోరాడబోతున్నాం. కానీ, మాకు స్వీట్ సాంబార్లాగా మ్యాచ్ ఫలితం ఉండాలనుకుంటున్నాం. వివో ఐపీఎల్ 2019 బెంగళూరుతో జరిగే మ్యాచ్తో మొదలుకానుంది’ అని ట్వీట్ చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ ట్వీట్కు ఘాటుగా రిప్లైఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. సాంబార్ ఎప్పుడూ పచ్చ కలర్లోనే ఉంటుంది తెలుసా?’ అని సెటైర్లేసింది. ఈట్వీట్లపై అభిమానులు వారికి తోచిన కామెంట్లు చేస్తున్నారు. అంటే చెప్పకనే చెప్తూ తాము రెబల్ అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. మ్యాచ్ 23న ఢిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్ 12వ సీజన్కు తెరలేవనుంది