Saturday, April 27, 2024
- Advertisement -

ఉజ్జయినిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం…ఒకే కుంటుంబానికి చెందిన 12 మంది మృతి

- Advertisement -

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచుసుకుంది. ఉజ్జయిని జిల్లా రామ్‌గఢ్‌ సమీపంలో మంగళవారం ఉదయం 12:30 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొని 12 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.

రోడ్డుప్రమాదం జరగడం దురదృష్టకరమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -