Saturday, April 27, 2024
- Advertisement -

బాలు ఆస్పత్రి ఖర్చు ఎంతైంది.. వివాదం చెలరేగింది..!

- Advertisement -

బాలు మరణ వార్త తెలియగానే అభిమానులు శోక సంద్రంలోకి వెళ్లిపోయారు. ఇది ఇలా ఉంటే కొందరు బాలు ఆస్పత్రి బిల్లులపై వివాదం రేపారు. ఈ వివాదంపై ఎస్పీ చరణ్ స్పందించారు. బిల్లు చెల్లించలేదని బాలు పార్థీవ దేహాన్ని ఎంజిఎం ఆస్పత్రి కుటుంబ సభ్యులకు అప్పగించలేదని కొందరు ప్రచారం చేశారు. ఈ రూమర్స్ పై స్పష్టత వచ్చింది.

డబ్బు సర్దుబాటు చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని బాలు కుటుంబ సభ్యులు కోరగా అందుకు ప్రభుత్వం తిరస్కరించిందని పుకార్లు వచ్చాయి. దాంతో బాలు ఆస్పత్రి బిల్లు ఎంత? ఎవరు కట్టారు? అని చర్చ మొదలైంది. తన తండ్రి ఆస్పత్రి బిల్లుల విషయంలో వస్తున్న పుకార్లు నిజం కాదని అదంతా తప్పుడు ప్రచారమే అని బాలు తనయుడు చరణ్ తెలిపారు.

ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో అని మండిపడ్డారు. ఆస్పత్రి బిల్లు ఎంత అయ్యింది? ఎవరు ఎంత చెల్లించారు? వంటి విషయాలు ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి విడుదల చేస్తానని చరణ్ తెలిపాడు. ఈ పరిస్థితి రావడం నిజంగా ఎంతో దురదృష్టకరమని ఆయన అన్నారు. తన తండ్రి చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలను ఎంజిఎం ఆస్పత్రికి అపోలో ఆస్పత్రి వారు పంపించారని ఆయన తెలియజేశారు.

కండలు తప్ప బుర్ర పెంచలే అంటూ మెహబూబ్ పై ట్రోలింగ్..!

రాత్రి లైట్లు ఆఫ్ చేసి ఈ ముగ్గురు హౌస్ లో అలా చేశారు :…

దివి ప్రేమించిన అబ్బాయిని ఎందుకు వదిలేసిందో తెలుసా ?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాక్షిదీక్షిత్ హౌస్ ఎవరికి పడిపోయిందంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -