Saturday, April 27, 2024
- Advertisement -

ఎస్పీ బాలు గారి చివరి పాట పారితోషకం ఎంతో తెలుసా ?

- Advertisement -

చిన్న జ్వరం మాత్రమే మీ అందర్ని మళ్లీ కలుసుకుంటాను అని మెసేజ్ పెట్టి.. కరోనాతో ఆసుపత్రిలో చేరి.. కరోనా తగ్గినా సరే.. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో తిరిగిరాని లోకాలకు వెళ్ళారు ఎస్పీ బాలు గారు. అన్ని భాషల్లో పాటలు పాడి అభిమానులను సంపాధించుకున్న బాలు గారు ఇక లేరన్న వార్త తెలియగానే అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తన పాటలతో ఎందరినో అభిమానులను చేసుకున్న బాలు గారు వ్యక్తిగా ఎందరినో ఆదరించారు.

అందుకే ఆయనతో గల అనుబంధాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా బాలు గారి గురించి రోజుకో వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. బాలుతో గల అనుబంధాన్ని సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ రవివర్మ షేర్ చేసుకుంటూ.. చిన్నప్పటినుంచి బాలు పాటలు వింటూ పెరిగానని.. బాలు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఉన్నానంటే అందుకు బాలు ఇచ్చిన స్ఫూర్తే కారణమని చెప్పారు. ఎంతోమందిని ఎంకరేజ్ చేసిన బాలు తనను కూడా ప్రోత్సహించారని తెలిపారు. బాలు గారు ఏ పాట పాడిన డబ్బు డిమాండ్ చేసేవారు కాదు. ఆయనకు డబ్బు మీద అసలు వ్యామోహం లేదు.

రవివర్మ సంగీత దర్శకత్వం వహించిన చీమ ప్రేమ మధ్యలో భామ మూవీ లో ఓ సాంగ్ బాలు గారు పాడారు. పాటకోసమే రెమ్యునరేషన్ గురించి రవివర్మ అడిగారట. ట్రాక్ పంపించి, మేనేజర్ తో మాట్లాడండు అని బాలు బదులిచ్చారట. దాంతో మేనేజర్ కి ట్రాక్ పంపించి డబ్బుల గురించి అడిగితే.. మీదగ్గర నుంచి డబ్బులు తీసుకోవద్దని చెప్పారు అని చెప్పారట. . నా గురించి పెద్దగా తెలీదు, ఆయనతో కూర్చుని మాట్లాడుకున్న ఘటనలు కూడా లేవు. అయినా సరే నాపట్ల బాలు గారు ఇలా అభిమానంగా వ్యవహరించడం మరిచిపోలేను అని రవివర్మ కన్నీళ్లు పెట్టుకున్నారు.

రష్మీకతో అఖిల్.. బొమ్మ హిట్ ఫక్కా..!

నవదీప్, రవి అదిరింది నుంచి ఎందుకు బయటకు వచ్చారంటే ?

గంగవ్వ కోసం బిగ్ బాస్ ఎన్ని లక్షలతో ఇల్లు కట్టిస్తున్నారంటే ?

బిగ్ బాస్ లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ మోనాల్ కే.. ఎంతంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -