Monday, April 29, 2024
- Advertisement -

అజిత్ హీరో అయ్యింది బాలు గారి వల్లే.. ఎవరికి తెలియని విషయం..!

- Advertisement -

వేలకు వేలు పాటలు పాడిన ఎస్‌.పి. బాలుసుబ్రహ్మణ్యం గారు లేరన్న వార్త తెలియగానే ప్రపంచం దుఖంలోకి వెళ్లింది. అందరితో ఆత్మీయంగా ఉండే ఆయనతో గల అనుబంధంను అందరు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. భౌతికంగా బాలు గారు లేకున్న ఆయన పాటలు మాత్రం ప్రతి నిమిషయం ఆయనను గుర్తు చేస్తునే ఉంటాయి. అయితే బాలు గారు చనిపోయిన తర్వాత టాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎవరు కూడా ఆయనను చూసేందుకు వెళ్లలేదు. తమిళ స్టార్ హీరో విజయ్‌, అర్జున్‌ వంటి వారు మాత్రమే బాలు అంత్యక్రియలకు వెళ్లారు. ఇక బాలుకి అత్యంత సన్నిహితుల్లో అజిత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

అయితే బాలు గారి అంత్యక్రియలకు అజిత్‌ ఎందుకు వెళ్లలేదనే మాట కూడా వినిపిస్తోంది. ఈ విషయంపై బాలు కుమారుడు చరణ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎవరు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఎవరూ వచ్చినా, రాకపోయినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. అయితే అజిత్‌కు, బాలు ఫ్యామిలీకి ఉన్న బంధం విషయానికి వస్తే.. చరణ్‌, అజిత్‌లు స్కూల్‌ మేట్స్. అందుకే చిన్నప్పుడు అజిత్‌ ఎక్కువగా బాలు వాళ్ల ఇంట్లోనే ఉండేవాడట. అంతేకాకుండా.. అజిత్‌ సినిమా ప్రస్థానం కూడా బాలు రికమండేషన్‌తోనే మొదలైందట.

ఓసారి మోడలింగ్ షాట్ కోసం.. చరణ్ చొక్కా తీసుకునేందుకు వచ్చిన అజిత్ ని చూసిన బాలు బాగా గుర్తు పెట్టుకున్నారట. ఆ తర్వాత గొల్లపూడి శ్రీనివాసరావు డైరెక్షన్లో తీస్తున్న సినిమాకి హీరో కోసం వేతుకుతుండగా.. అజిత్‌ పేరును బాలు సిఫార్సు చేసాడట. అలా అజిత్‌ హీరో అయ్యాడు. అజిత్‌ నటించిన తెలుగు స్ట్రయిట్‌ సినిమా ఇదే. అదే ప్రేమ పుస్తకం. అలా అజిత్ హీరో కావడానికి బాలు గారు కారణమయ్యారు. అప్పటి నుంచి బాలు ఫ్యామిలీతో అజిత్ చాలా క్లోజ్ గా ఉండేవారట. అందుకే బాలు చివరి చూపు విషయంలో అజిత్‌ ఎందుకు రాలేదనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

బిగ్‌బాస్ లో గాయపడిన అవినాష్.. ఏం జరిగింది ?

కమెడియన్ సుధాకర్ కొడుకు ఇప్పుడెలా ఉన్నాడో చూడండి..?

యాంకర్ ప్రదీప్ కి పెళ్లి.. పెళ్లి కూతురేవరంటే..?

బిగ్ బాస్ హౌస్ లో కాస్టింగ్ కౌచ్.. చెప్పుతో కొట్టాలి : కళ్యాణి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -