Thursday, May 9, 2024
- Advertisement -

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మోదీ సర్కార్ బిగ్ షాక్..

- Advertisement -

భారత్ మాజీ ప్రధాని, కాంగ్రెస్ రాజ్యసభ్యుడు మన్మోహన్ సింగ్ కు మోదీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ కు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది. ఆయనను సీఆర్ఫీఎఫ్ బలగాల భద్రత కిందకు తీసుకొచ్చింది. దేశంలోని ప్రముఖుల భద్రతను సమీక్షించే విభాగం నివేదికల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

మన్మోహన్ కు ఎస్పీజీ భద్రతను తొలగించినప్పటికీ… ఆయనకు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కొనసాగుతుందన్నారు. ప్రముఖుల జీవితాలకు ముప్పు ఎంత వరకు ఉందనే వార్షిక సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ అధికారి తెలిపారు.మరోవైపు, పదేళ్ల పాటు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్… తన భద్రత విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావడం లేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -