- Advertisement -
టీడీపీ చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అయనను కుటుంభ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. కాగా, ఏపీలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చిత్తూరు నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ నేత రెడ్డెప్ప చేతిలో ఓడిపోయారు.