Friday, April 26, 2024
- Advertisement -

కాళేశ్వరంపై ఈ హీరోల హాట్ కామెంట్స్

- Advertisement -

టాలీవుడ్ హీరోలు కూడా తెలంగాణ పండుగలో భాగస్వామ్యం అయ్యారు. తెలంగాణలో ఉండడం.. అందునా హైదరాబాద్ లో వ్యాపారాలున్న వారు స్పందించకుండా ఎలా ఉంటారని అనుమానపడుతున్నారా.? కారణమేదైనా సరే కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై హీరోలు నాగార్జున, రవితేజలు స్పందించారు.

ఇదివరకు తెలంగాణ వచ్చిన కొత్తలో నాగార్జున ఆస్తులపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఆ తర్వాత కేటీఆర్ తో నాగార్జున సన్నిహిత సంబంధాలు నెరిపారు. ఇక మరో హీరో రవితేజ కూడా డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు.

ఆ తర్వాత పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుల విషయంలో మౌనం దాల్చింది. దీంతో టాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విషయంలో సానుకూలంగా ఉంటున్నారు..

తాజాగా ట్విట్టర్ వేదికగా నాగార్జున కాళేశ్వరం ఓపెనింగ్ పై స్పందించారు. ప్రశంసలు కురిపించారు. ‘నీరే ప్రపంచమని.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ప్రారంభించినందుకు కేసీఆర్, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు అని.. ఇది అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభ ’ అని ట్వీట్ చేసి కీర్తించారు. ఇక ఇంత గొప్ప ప్రాజెక్టును నిర్మించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు అభినందనలు అంటూ రవితేజ ట్వీట్ చేశారు. ఇలా ఇద్దరు పాజిటివ్ గా స్పందించడం చూసి నెటిజన్లు కూడా సెటైర్ లు వేస్తున్నారు. వారికి భయపడి ట్వీట్ చేశారా అని కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ హీరోల పాజిటివ్ స్పందన ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -