- Advertisement -
మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వచ్చేవారి గుండెల్లో గునపం దింపుతామని హెచ్చరించారు. తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను వెంటనే ప్రభుత్వం రద్దుచేయాలని డిమాండ్ చేశారు.తవ్వకాలకు సహకరిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ నేతలపై సామాజిక బహిష్కరణ విధించాలని సూచించారు. యురేనియం తవ్వకాలు జరగడంలేదంటూ సీఎం కేసీఆర్ హామీ ఇవ్వాలని, హామీ ఇచ్చేంతవరకు పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు.
నల్లమల అడవి బిడ్డలను తాను అండగా నిలుస్తానని, నల్లమలలో ఎవరైనా యురేనియం తవ్వడానికి వస్తే వారి గుండెల్లో గునపం దింపుతానని హెచ్చరించారు.యురేనియం తవ్వకాలను అడ్డుకోలేకపోయారంటూ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై విరుచుకుపడ్డారు.ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపించారు