Friday, April 26, 2024
- Advertisement -

పార్టీ మార్పుపై.. దేవనేని సంచలన ప్రకటన

- Advertisement -

టీడీపీ ఘోర ఓటమి పాలైంది. అందరూ అధికార బీజేపీ వైపు, వైసీపీ వైపు ఆశగా చూస్తున్నారు. చాన్స్ వస్తే చాలు టీడీపీని వీడేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే కాకినాడలో కాపు నేతలు సమావేశమై బీజేపీలో చేరికపై ఉత్సాహం చూపారు. కానీ ఇంతవరకు ఎవరూ బీజేపీలో చేరలేదు.

ఇక మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా ఆధ్వర్యంలో చాలా మంది బీజేపీలోకి వెళుతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఆయన ఖండించినా ఆ వార్తలు ఆగడం లేదు. ఇక టీడీపీ యువత అధ్యక్షుడు, గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఈ ఎన్నికల్లో నాని చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. టీడీపీని వీడుతారనే ప్రచారం బాగా సాగుతోంది.

తాజాగా గుడివాడలో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న దేవినేని అవినాష్ తాను టీడీపీని వీడనని.. ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

తనకు టీడీపీ పదవులు అక్కర్లేదని.. ప్రజాసేవ చేయడానికి చిత్తశుద్ధి ఉందని చెప్పుకొచ్చారు. పదవుల కోసం అలిగి టీడీపీని వీడుతున్నానన్న వార్తలు అవాస్తవం అన్నారు. చంద్రబాబు నిర్ణయాలు నచ్చేచేరానని వివరణ ఇచ్చారు. వైసీపీలో చేరేది లేదని క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం టీడీపీ ఘోర ఓటమితో ఎంతో చరిత్ర ఉన్న దేవినేని ఫ్యామిలీ, అవినాష్ వైసీపలో చేరాలనుకున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు క్లారిటీ ఇవ్వడంతో ఈవార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -