ఎన్నికల టైంలో భాజాపాలోకి వలసలు ఊపందుకున్నాయి.ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమైన లీడర్లు కాషాయం గూటికి చేరుకుంటున్నారు. ఇప్టికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కుతుంటె పార్టీలో పెద్దదిక్కుగా ఉన్న సీనియర్లీడర్లు భాజాపా గూటికి చేరుతున్నారు.ఉమ్మడి పాలమూరులో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ సైతం ఆ పార్టీకి హ్యాండిచ్చి భాజాపా తీర్థం పుచ్చుకున్నారు.
ఢిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల్లో ఆమెకు మహబూబ్నగర్ సీటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదలా ఉంటె మరో మాజీ మంత్రి కాంగ్రెస్కు గుడ్బాయ్ చెప్పనున్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కాషాయం గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. రెండు, మూడు రోజుల్లో ఆమె కూడా బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.మెదక్ లోక్ సభ స్థానాన్ని ఆమెకు కేటాయించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.