- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో జంపింగ్ లు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. భాజాపా ఆపరేషన్ ఆకర్ష్ ద్విగ్విజయంగా కొనసాగుతోంది.ప్రధానంగా కమలం పార్టీ టీడీపీ నేతలపైనె ఫోకస్ పెట్టింది. టీడీపీకీ చెందిన ఇద్దరు మాజీ మంత్రులతో పాటు జనసేన,కాంగ్రెస్ నుంచి కమలం గూటికి చేరేందుకు సిద్దమయ్యారు.
ఇద్దరు మాజీ మంత్రులు శనక్కాయల అరుణ, వాకాటి నారాయణ రెడ్డి (ప్రస్తుతం ఎమ్మెల్సీ) బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఒక్క టీడీపీ నుంచే కాదు. కాంగ్రెస్, జనసేన నుంచి కూడా పలువురు నేతలు కమలం గూటికి చేరుతున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 10 మంది నేతలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలిశారు. సాయంత్రం 4 గంటలకు నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
పార్టీ మారే నేతలు….
- శనక్కాయల అరుణ (మాజీ మంత్రి, టీడీపీ)
- వాకాటి నారాయణరెడ్డి (మాజీ మంత్రి, ఎమ్మెల్సీ – టీడీపీ)
- చింతల పార్థసారథి (జనసేన)
- పాతూరి నాగభూషణం (మాజీ జెడ్పీ చైర్మన్)
- నక్కా బాలయోగి (హైకోర్టు మాజీ న్యాయమూర్తి)
- తోట నాగేష్ (టీడీపీ)07. రామినేని ధర్మ ప్రచారం (ఎన్ఆర్ఐ – రామినేని ఫౌండేషన్)
- గట్టి చిన్న సత్యనారాయణ (టిడిపి నేత)
- బొబ్బిలి శ్రీనివాస రావు (కాంగ్రెస్ నేత)
- రవి (పూతల పట్టు)