ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ నుంచి వలసలు జోరందుకోవడంతో టీడీపీలో అలజడి మొదలైంది. ఇప్పటికే పార్టీ అధినేత బుజ్జగించినా ఎవరూ మాటను లెక్క చేయడంలేదు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు పార్టీ మరి జగన్ సమక్షం లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ప్రముఖ సినీనటి మాజీ ఎమ్మెల్యే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే టీడీపీనేత అయిన జయసుధ వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. గురువారం సాయంత్రం వైఎస్ జగన్తో భేటీ అవనున్నారు. అనంతరం జయసుధ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో కాంగ్రెస్ తరుపున సికీంద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు జయసుధ.
రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న జయసుధ తర్వాత టీడీపీలో చేరారు. అయితే పార్టీ కార్యక్రమాలకు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానునున్న నేపధ్యంలో వైసీపీ చీఫ్ జగన్తో భేటీ కానున్నారు. అనంతరం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారని పార్టీ వర్గాల సమాచారం.
తన సహ నటుడు మురళీమోహన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి జయసుధను టీడీపీలో జాయిన్ చేయించారనే ప్రచారం అప్పట్లో నడిచింది. ఈసారి ఎన్నికల్లో మాకుటుంబంనుంచి ఎవరూ పోటీ చేయరని మురళీ మోహన్ ప్రకటించడంతో జయసుధ కూడా పీర్టీని వీడుతున్నారా అన్న వార్తలు వస్తున్నాయి.
తన భర్త మరణానంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయసుధ… మళ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు జయసుధ వైసీపీలో చేరినా… ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందా రాదా అన్నది తేలాల్సి ఉంది.