Saturday, April 27, 2024
- Advertisement -

వీఎమ్ ఆర్ & టైమ్స్ నౌ సర్వేలోనూ వైసీపీ హవా…

- Advertisement -

ఏపీలో పోలింగ్ కు ఇంకా మూడు రోజులు మాత్రేమే ఉండటంతో దాదాపు అన్ని ఛానళ్లు ఫైనల్ సర్వేలు ప్రకటిస్తున్నాయి. అన్ని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు సుడిగాలి ప్రచారం లో దూసుక పోతున్నారు. ఎన్నికల ప్రచారానికి మిగిలింది ఒక్కరోజు మాత్రమే ఉంది. తాజాగా వీఎమ్ఆర్ & టైమ్స్ నౌ తన సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇందులో వచ్చి రిజల్ట్స్ షాకింగ్ గా ఉన్నాయి. ఈ ఛానల్ కేవలం ఎంపీ సీట్ల ఫలితాలు మాత్రమే కవర్ చేసింది.

వీఎమ్ఆర్ & టైమ్స్ నౌ సర్వేలో అసెంబ్లీ సీట్ల సర్వే కాకుండా ఎంపీ సీట్ల సర్వే ఫలితాలను మాత్రమే ప్రకటించింది. ఈసర్వేలో వైసీపీ 20 ఎంపీ సీట్లు గెలుచుకొని ప్రాంతీయ పార్టీల్లో మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని వీఎమ్ఆర్ & టైమ్స్ నౌ అంచనా వేసింది. మొత్తం ఇరవై ఐదులో ఇరవై అంటే మామూలు విషయం కాదు.. ఒక రకంగా చెప్పాలంటె ప్రభంజనమే.

ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నందువల్ల.. ఎంపీ సీట్ల లెక్కలను బట్టి చూస్తే వైసీపీకి కనీసం 120 నుంచి 130 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టే. ఇప్పుడు ఏపీలో ఉన్న టైట్ ఫైట్ పరిస్థితుల్లో ఈ స్థాయి మెజారిటీ సాధ్యమేనా అన్న చర్చ ఇప్పుడు అందరిలో జరుగుతోంది. ఇక టీడీపీ 5 సీట్లకే పరిమిత మవుతుందని సర్వే తేల్చింది.

ఇక ఓట్ల శాతపరంగా చూసుకుంటె వైసీపీ 43.7 శాతం, టీడీపీ 35.1 శాతం, కాంగ్రెస్ 2.1 శాతం, భాజాపా 5.7 శాతం ఓట్ల షేర్ సాధిస్తాయని వీఎమ్ఆర్ & టైమ్స్ నౌ సర్వేలో తేలింది. ఏది ఏమైనా సర్వే ఫలితాలు వైసీపీకీ అనుకూలంగా రావడం ఆ పార్టీకి ఊరట కలిగించే విషయం. మరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -