Wednesday, May 8, 2024
- Advertisement -

బాబు గారు ఇళ్లు కోసం దరఖాస్తు చేసుకోండి.. వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైసీపీ ఎమ్మేల్యే ఆర్కే

- Advertisement -

కృష్ణా నదికి వరద నీరు పోటెత్తడంతో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ వరద తాకిడికి గురయ్యింది. అదే విధంగా వరద ముప్పు పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రభుత్వం డ్రోన్ ను వినియోగించింది. వరద ముప్పులో ఉన్న బాబు నివాసాన్ని కూడా డ్రోన్ చిత్రాలు తీసింది.

ఇదంతా వైసీపీ కావాలనే చేస్తుందని చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమ చౌకబారు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెుల్యే ఆర్కే.కృష్ణా నదికి వస్తున్న వరదపై కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అలాంటిది మాజీ మంత్రి దేవినేని ఉమ ఈరోజు కావాలనే కృత్రిమ వరదను ప్రభుత్వం సృష్టిచిందని చెప్పడం దారుణమని వ్యాఖ్యానించారు.

దేవినేని ఉమ గారిని నేను ఒక్కటే అడుగుతున్నా.. అయ్యా దేవినేని ఉమ గారూ.. ఓటుకు నోటు కేసులో విచారణ ప్రారంభం కాకముందే హైదరాబాద్ నుంచి పారిపోయారు. చంద్రబాబు వారికి చిక్కకుండా, దొరకకుండా ఉండేందుకు పడవ వేసుకుని ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిలో తిరుగుతూ ఇవన్నీ అక్రమ నిర్మాణాలనీ, వీటిని తొలగిస్తాం అని ఉమ చెప్పిన మాట వాస్తవం కాదా? ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పండంటూ ప్రశ్నించారు.

చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కొన్నారా? సొంత ఇల్లు ఉందా? మీరు అమరావతి రాజధాని అని ప్రకటించగానే అప్పటి ప్రతిపక్ష నేత జగన్ అక్కడే ఇల్లు, ఆఫీసు కట్టుకున్నారు. అంటే రాజధాని నిర్మాణంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉన్నట్లా? లేక జగన్ కు చిత్తశుద్ధి ఉన్నట్లా? ని ప్రశ్నించారు.

వచ్చే ఉగాది నాటికి ఇల్లులేని వారందరికి పక్కా ఇళ్లు మంజూరు చేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్ అన్నారు. మీరు దరఖాస్తు పెట్టుకుంటే మా వాలంటీర్ మీ ఇంటి వద్దకు వచ్చి సెంటున్నరో స్థలం ఇస్తారు. లేదా మీరు లక్షల కోట్ల అవినీతి చేశారు కదా.. ఆ డబ్బులు కట్టుకున్నా ప్రభుత్వం మీ ఇంటికి భద్రతను కల్పిస్తుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -