Friday, April 26, 2024
- Advertisement -

బాబాయ్‌ని గొడ్డ‌లితో న‌రికి చంపారు…జ‌గ‌న్ ఇంకా ఏమ‌న్నారంటే

- Advertisement -

సుదీర్ఘరాజకీయ చరిత్రకలిగిన తన చిన్నాన్నను అత్యంత దారుణంగా కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపేశారంటూ జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు. ఇది ముమ్మాటికి హ‌త్యేన‌ని తెలిపారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై మాకు న‌మ్మ‌కం లేద‌ని….నిజాలు బ‌య‌ట‌కు రావాలంటె థ‌ర్డ్ పార్టీచేత విచార‌ణ జ‌రిపించాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు. ఇంట్లోకి చొరబడి గొడ్డళ్లతో వివేకానందను నరికిచంపారని ఆరోపింన జ‌గ‌న్‌… ఓ తప్పుడు లేఖని సృష్టించి..డ్రైవర్‌పై నేరం మోపేందుకు కుట్రచేస్తున్నార‌ని మండి ప‌డ్డారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే మా కుటుంబంలో హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తిని ఇంట్లోకి వెల్లి గొడ్డ‌ల్ల‌తో అతికిరాత‌కంగా చంపార‌న్నారు. తమ తాత రాజారెడ్డి, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గతంలో ఇలానే కుట్రచేసి చంపేశారని..తనపైనా విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిందన్నారు. ఈ మూడు సంగ‌ట‌న‌ల‌పై బాబు ప్ర‌మేయం ఉంద‌న్నారు. తమ కుటుంబంపై తెలుగుదేశం ప్రభుత్వం కక్ష కట్టిందని తమ కుటుంబాన్ని రాజకీయంగా అంతమెుందించేందుకు కుట్ర పన్నుతోందని జగన్‌ఆరోపించారు.

బెడ్రూంలో అతి కిరాతకంగా నరికి చంపి.. బాత్రూంలోకి తీసుకొచ్చి రక్తం కక్కుకొని మరణించినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారని జగన్ అన్నారు. హత్య చేసిన తర్వాత బాత్రూంలోకి ఎత్తుకెల్లి.. బాత్రూంలో గోడలకు రక్తం పూశార‌న్నారు . ఇది ఒక్కరి వల్ల అయ్యే పనికాదు ఈ హత్య వెనుక ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులున్నార‌న్నారు.

కేసును త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు లెటర్ రాసినట్లు సృష్టించారన్నారు. నేను ఇక్క‌డ‌కు రాగానే పోలీసులు లెటర్ చూపించారు. హంతకుల సమక్షంలో ఆయన లెటర్ ఎలా రాయగలుగుతారు. రక్తంతో కూడిన లెటర్ ఎలా రాస్తారంటూ ప్ర‌శ్నించారు. హత్య వెనుక ఎంత పెద్ద వాళ్లు ఉన్నా బయటకి రావాలి. సీబీఐతో దర్యాప్తు చేస్తేనే నిజాలు బయటకొస్తాయి’ అని జగన్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -