Friday, April 26, 2024
- Advertisement -

జంతువుల మధ్య ఈ ప్రేమను చూస్తే కన్నీల్లోస్తాయి..?

- Advertisement -

ప్రపంచంలో ప్రేమ కేవలం మానవునికి మాత్రమే సొంతం కాదు ఇక్కడ నివసిస్తున్న అన్ని జీవరాశులకు అది ఉంటుంది.. తమ జాతిలోని ఇతర జీవుల పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉండడమే కాకుండా అవి లేకుండా జీవించలేనంతగా అవి ప్రవర్తిస్తుంటాయి.. తాజాగా ఓ ఆవును కొనుక్కున్న వ్య‌క్తి దాన్ని వాహ‌నంలో అక్క‌డి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్తుండ‌గా దాని వెన‌కాలే ఎద్దు ప‌రుగులు తీసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. దీంతో భార‌త్ లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా తెలిసింది.

ఇటీవ‌ల ఓ రైతు త‌న ఆవును అమ్మేయ‌గా దాన్ని ఓ వాహ‌నంలో తీసుకెళ్లారు. అయితే, ఆ ఆవును వాహ‌నంలో ఎక్కించిన వెంట‌నే ఎద్దు కంగారు ప‌డిపోయింది. దాన్ని వ‌దిలేయాల‌ని వేడుకుంటున్న‌ట్లు అటూ ఇటూ తిరిగింది. దీంతో వీధిలోని వారంద‌రూ ఆశ్చ‌ర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను త‌మ స్మార్ట్ ఫోన్ల‌లో తీశారు. అయితే, చివ‌ర‌కు ఆ ఆవును వాహ‌నంలో తీసుకెళ్లిపోయారు. చాలా దూరం వ‌ర‌కు ఆ వాహ‌నం వెన‌కాలే ఎద్దు ప‌రుగులు తీసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇది వైర‌ల్ కావ‌డంతో ల‌క్ష‌లాది మంది దీనిపై స్పందించారు.

దీంతో చివ‌ర‌కు వారి విజ్ఞ‌ప్తులు ఆ ఆవును కొన్న వ్య‌క్తుల వ‌ర‌కు వెళ్లాయి. దీంతో ఆ రెండింటినీ మ‌ళ్లీ క‌లిపి, పూజ‌లు చేశారు. మనసులను కదిలించే ఈ వీడియోను దేశంలోని ప్ర‌ముఖులు ట్వీట్ చేస్తున్నారు. హీరోయిన్ స‌మంత కూడా ల‌వ్ సింబ‌ల్ పోస్ట్ చేసి, ఈ వీడియోను షేర్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -