Friday, April 26, 2024
- Advertisement -

హార్దిక్ పాండ్యాకు మరో బిగ్ షాక్‌…

- Advertisement -

కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో అమ్మాయిలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, రాహుల్‌లు ఇద్ద‌రూ నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గుర‌య్యారు.దీంతో బీసీసీఐ వారిమీద చ‌ర్య‌లు తీసుకుంది. విచార‌ణ ముగిసే వ‌ర‌కు వారిపై నిషేధం కొన‌సాగుతుంద‌ని తెలిపింది. దీంతో ఇద్ద‌రు ఆట‌గాల్లు ఇండియాకు తిరిగి వ‌చ్చారు.

పాండ్యాకు జిల్లేట్ కంపెనీ షాక్ ఇచ్చింది. పాండ్యాతో చేసుకున్న ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇది జ‌రిగి రెండు రోజులు కాక‌ముందే మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. పాండ్యాకు గతంలో ఇచ్చిన గౌరవ సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ముంబైకు చెందిన ప్రఖ్యాత జింఖానా స్పోర్ట్స్ క్లబ్ ప్రకటించింది.

ఇప్ప‌టికే వీరిద్ద‌రికి బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీచేసిన సంగ‌తి తెలిసిందే.దీంతో పాండ్యా, రాహుల్ క్షమాపణలు కోరుతూ జవాబిచ్చారు. కీలకమైన 2019 ప్రపంచకప్ కు ఐదు నెలల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ క్రికెట‌ర్లు అచితూచి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -