ఇండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ధోనీకి ఓ ప్రత్యేకత ఉంది . మ్యాచ్లో మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడంలో ధోనీకి ఎవ్వరూ సాటిరారు. కీలక సమయాల్లో ధోనీ చేసిన స్టంప్ అవుట్లు విజయంలో కీలక పాత్ర పోషించాయి. మొదటి టి 20లో ధోని రెండు క్యాచ్లు, రెండు స్టంప్ అవుట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో కూడా అటూ బ్యాటింగ్లో, ఇటూ కీపింగ్లో అందర్ని అబ్బురపరిచాడు.
రెండో టీ20లో భారత్ 20 ఓవర్లలో 260 పరుగులు చేసింది. ఇండియాకు టి20లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక లక్ష్యఛేదనలో తడబడి 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది.
కుల్దీప్ యాదవ్ వేసిన 15 ఓవర్లో గుణరాత్నే షాట్ ఆడబోయి వికెట్ల వెనుక ధోనికి చిక్కాడు. అందరూ నాటౌట్అనుకున్నారు.. కానీ ధోని మాత్రం ఆ సమయంలో చాలా కానిఫిడెంట్గా కనిపించారు. లెగ్ ఆంపైర్ నిర్ణయాన్ని థర్డ్ ఆంపైర్కు ఇచ్చాడు. చివరకు అది స్టంప్ అవుట్ అని తేలింది. అలాగే, చాహల్ వేసిన 16 ఓవర్లో శ్రీలంక బ్యాట్స్మెన్ సమరవిక్రమను కూడా ధోని స్టంప్ అవుట్ చేశాడు. అద్భుత ప్రదర్శనతో ధోని ఇటీవల తనపై వచ్చిన రూమర్స్కు తనదైన శైలిలో సమాధానం చెబుతున్నాడు.
అయితే రోహిత్ అవుట్ అయిన తర్వాత అనూహ్యంగా వన్డౌన్లో వచ్చిన ధోని అందర్నీ ఆశ్చర్య పరిచాడు. (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాహుల్కు జత కలిశాడు. 14వ ఓవర్ తొలి రెండు బంతులను బౌండరీలు బాదాడు. మధ్యలో కొంత తగ్గినా… స్పిన్నర్ ధనంజయ వేసిన 17వ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టాడు. రాహుల్తో కలిసి రెండో వికెట్కు 78 పరుగులు జత చేశాడు.
మరో వైపు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తన కెప్టెన్సీలో ధోనిని 4వస్థానంలో బ్యాటింగ్కు పంపిస్తానని చెప్పిన రోహిత్ శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో మూడో స్థానంలోనే బ్యాటింగ్కు ఆహ్వానించాడు.