Friday, April 26, 2024
- Advertisement -

కోహ్లీకి పాక్‌ మాజీ బౌలర్‌ వసీం ఆక్రమ్ హెచ్చ‌రిక‌…..

- Advertisement -

ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. పాక్‌పై ఘ‌న‌విజ‌యం సాధించిన త‌ర్వాత భార‌త ఆట‌గాళ్లు సేద తీరుతున్నారు. త‌దుప‌రి మ్యాచ్‌ను ఆప్ఘ‌న్‌తో కోహ్లీ సేన త‌ల‌ప‌డుతోంది. ఈ సంర్భంగా పాక్ మాజీ కెప్టెన్ వ‌సీం అక్ర‌మ్ కోహ్లీకి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఆప్ఘ‌న్ జ‌ట్టును తేలిగ్గా తీసుకోవ‌ద్దిని అలా తీసుకుంటె భారీ మూల్యం చెల్లించుకుంటార‌ని హెచ్చ‌రించారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై కోహ్లీ స్పందించారు. ప్రతీ మ్యాచ్‌ను గెలవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతామని, అఫ్గాన్‌తో సహా ఏ జట్టును తేలిగ్గా తీసుకోమని స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌ కీలకమే. అఫ్గాన్‌తో సహా ఏ జట్టును తక్కువ అంచనా వేయడం లేదు. వారిదైన రోజు వాళ్లు విరుచుకపడతారు. ప్రతీ మ్యాచ్‌ గెలవాలనే పోరాడతాం. మాకు రెండు మ్యాచ్‌ల మధ్య గ్యాప్‌ ఉండటం ఎంతో సానుకూలాంశమ‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -