- Advertisement -
అఫ్గానిస్థాన్తో సౌథాంప్టన్ వేదికగా ఈరోజు జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టుకు ఆదిలోనె పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
ఓపెనర్ రోహిత్ శర్మ (1: 10 బంతుల్లో) ఆరంభంలోనే ముజీబ్ బౌలింగ్లో బౌల్డవగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (26 నాటౌట్: 16 బంతుల్లో 3×4) మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (22 నాటౌట్: 40 బంతుల్లో 2×4) కలిసి భారత్ ఇన్నింగ్స్ నడిపిస్తున్న సమయంలో మహ్మద్ నబీ వేసిన 15వ ఓవర్లో రాహుల్(30) వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (38), విజయ్శంకర్ (7) ఉన్నారు. స్కోరు 18 ఓవర్లలో 79/2 .