- Advertisement -
అడిలైడ్లో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన చేజింగ్ ట్యాలెంట్ చూపించాడు. వన్డేలో మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. 108 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్స్లతో కెరీర్లో 39వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ వన్డేలో భారత్ విక్టరీ దిశగా వెళ్తోంది. 299 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన భారత్కు ధావన్, రోహిత్లు మంచి స్టార్ట్ ఇచ్చారు.
ధావణ్ అవుట్ అయిన తర్వాత క్రీజులో వచ్చిన కోహ్లి మరో ఓపెనర్ రోహిత్ శర్మ (43)తో కలిసి 54 పరుగులు జోడించాడు. అయితే భారీ షాట్కు ప్రయత్నించి రోహిత్ వెనుదిరగగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన రాయుడుతో కోహ్లి బాధ్యాతాయుతంగా ఆడాడు.