- Advertisement -
ఆసీస్తో జరగుతున్న ఐదు వన్డేల మ్యాచ్ల సిరీస్లో మూడో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ గెలిచి సిరీస్ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. హైదరాబాద్, బెంగళూర్లో జరిగిన రెండు వన్డేల్లో భారత్ ఘన విజయం సాధించి 2-0తో లీడ్లో నిలిచింది.
ఈ వన్డేలో అయిన విజయం సాధించి సిరీస్ను కొల్పోకుండా ఉండలని భావిస్తోంది అతిథ్య జట్టు. మొదటి రెండు వన్డేల్లో భారత్ జట్టు అటు బ్యాటింగ్లోను, ఇటు బౌలింగ్లోను పూర్తి అధిపత్యం సాధించింది.ధోని సొంత గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో అందరి కళ్లు ధోనిపైనే ఉన్నాయి.గత మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీతొ రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు.