Saturday, April 27, 2024
- Advertisement -

ఢిల్లీకి సన్ స్ట్రోక్…హ్యాట్రిక్ విజ‌యం కొట్టిన హైద‌రాబాద్‌..

- Advertisement -

ఐపీఎల్‌-12లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ ఐదు వికెట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది.హైద‌రాబాద్ సన్ స్ట్రోక్ కు ఢిల్లీ క్యాపిట‌ల్ విలవిల్లాడింది. దీంతో స‌న్ రైజ‌ర్స్ హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేసింది. పాయంట్ల ప‌ట్టిక‌లో ఆగ్ర‌స్థానంలో కొనాగుతోంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 14 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఓపెనర్ పృథ్వీషా (11) బౌల్డయ్యాడు. హైదరాబాద్ బౌలర్ల పదునైన బంతులకు బ్యాట్స్‌మెన్ ఎదురు నిలవలేకపోయారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే ఎదురొడ్డి నిలిచాడు. 41 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 43 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ 13 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 23 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 129 పరుగులు చేసి హైదరాబాద్ ముందు స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది.

ఢిల్లీ నిర్దేశించిన 130 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌.. మరో 9 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఛేదనలో బెయిర్‌ స్టో(48) ప‌రుగులు చేసి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. బెయిర్‌ స్టో అవుటయిన తర్వాత వెంటవెంటనే వార్నర్‌(10), విజయ్‌ శంకర్‌(16), పాండే(10), హుడా(10)లు నిష్క్రమించి విజయాన్ని ఆలస్యం చేశారు.మ్యాచ్‌ను గెలిపించిన అతడికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడి ఒక్క విజయం కోసం పరితపించి పోతున్న బెంగళూరు జట్టు నేడు కోల్‌కతాతో తలపడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -