భారత క్రికెటర్ మహమ్మద్ షమీ భార్య నుంచి తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మద్ షమీపై కోల్కతాలోని అలిపోర్ కోర్టు గత సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. విండీస్ టూర్ ముగిసినా షమీ అమెరికాలోనె గడుపుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం తన లాయర్ తో సంప్రదింపు జరుపుతున్నట్లు సమాచారం.
మహ్మద్ షమీ తనని వేధిస్తున్నాడంటూ గత ఏడాది మార్చిలో అతని భార్య హసీన్ జహాన్ కోల్కతాలో పోలీసు కేసు పెట్టింది. న్యాయస్థానం ముందు విచారణకు హాజరు కాలేదు షమీ. దీంతో ఆగ్రహించిన కోర్టు 15 రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. లేకుంటె అరెస్ట్ తప్పదని హుచ్చరించింది.
అమెరికాలో ఉంటున్న షహీ ఎప్పటి కప్పుడు బోర్డు అధికారులతో టచ్ లో ఉంటున్నారని ఓ అధికారి వెల్లడించారు. ఈనెల 12న భారత్కి అతను రానుండగా.. రెగ్యులర్గా లాయర్తో టచ్లో ఉన్నట్లు బోర్డులోని సంబంధిత అధికారులకి సమాచారం అందించాడు. ఛార్జ్ షీట్ ను పూర్తిగా పరిశీలించేంత వరకు షమీ పై ఎటువంటి చర్యలు తీసుకోమని బోర్డు అధికారి తెలిపారు.