Friday, April 26, 2024
- Advertisement -

ఇంగ్లండుకు క్యూ క‌డుతున్న భార‌తీయులు….ఎందుకో తెలుసా…?

- Advertisement -

ఐపీఎల్ ముగియ‌డంతో క్రికెట్ ప్రేమికుల చూపు ఇప్పుడు ప్ర‌పంచ‌క‌ప్‌పై ప‌డింది. ఎప్పుడెప్పుడు ప్ర‌పంచ క‌ప్ ప్రారంభం అవుతుందా అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రపంచ కప్ సంగ్రామం ఈనె 30న ప్రారంభం కానుంది. ఈ స‌మ‌రం ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో జరగనుంది. క్రికెట్ అంటె భార‌తీయుల‌కు ఎంత అభిమాన‌మో చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే ఇప్ప‌టినుంచె ఇంగ్లండుకు క్యూ క‌డుతున్నారు.

రోజుకు 3,500 మంది యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారంటే వరల్డ్ కప్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధార‌ణ రోజుల్లో రోజుకు 1,000 వీసా అప్లికేషన్స్ వస్తాయని గ్లోబల్ టూరిజం కౌన్సిల్ ప్రెసిడెంట్ ఇక్బాల్ ముల్లా తెలిపారు. అలాంటి ఇప్పుడు ఈ సంఖ్య 3,500 చేరడం ఆశ్చర్యకరమన్నారు. ఇదంతా ప్ర‌పంచ క‌ప్ కార‌ణ‌మే అని చెప్ప‌వ‌చ్చు. మ‌రో ప‌క్క ధోనికి ఇదే ఆఖ‌రి వ‌ర‌ల్డ్ క‌ప్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -