ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం మనందరికి తెలిసిందే.
తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేసే నిర్ణయం తీసుకుంది. ఈ విషయంను విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేష్ వెల్లడించారు.
పరీక్షలు నిర్వహించాలని.. ఆన్లైన్లో క్లాస్లు చెప్పించామని, పేపర్లను తగ్గించామని, పరీక్షల కోసం అందరినీ సమన్వయం చేశామని.. కానీ ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేయడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు.
సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల సాయం..!
దేశం కోసం అండగా ఉంటాం.. ప్రధానితో సీఎం జగన్..!
వేదాద్రి రోడ్డు ప్రమాదంలో మృతులకు 5లక్షల ఎక్స్గ్రేషియా : సీఎం జగన్