- Advertisement -
ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పేర్ని తల్లి నాగేశ్వరమ్మ(82) ఈరోజు తుదిశ్వాస విడిచారు. రెండ్రోజుల క్రితమే ఆంధ్రా హాస్పిటల్ నుంచి నాగేశ్వరమ్మ డిశ్చార్జ్ అయ్యారు.
ఈ తెల్లవారుజామున నాగేశ్వరమ్మ తీవ్ర అస్వస్థత పాలవడంతో మళ్లీ అదే ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. తల్లిని కోల్పోయిన పేర్ని నానికి సీఎం జగన్ తన సంతాపం తెలియజేశారు. తీవ్ర విచారంలో ఉన్న నానికి ఆయన ధైర్యం చెప్పారు.