- Advertisement -
ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి తండ్రి ప్రభూ దయాల్(95) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగానే ఆయన చనిపోయినట్లు పార్టీ ఓ సమావేశంలో పేర్కొంది. ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేసింది.
ఢిల్లీలోని కుమారుడి ఇంట్లో ప్రభూ తుది శ్వాస విడిచారు. తండ్రి భౌతిక కాయానికి మాయావతి నివాళి అర్పించారు.ప్రభూ దయాల్.. తపాలా శాఖలో సెక్షన్ హెడ్గా విధులు నిర్వర్తించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఆరుగురు కుమారులు.
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్నుమూత!
ఏపి మంత్రి పేర్ని నాని ఇంట విషాదం!