టీడీపీలో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యప్రభ బెంగుళూరు వైదేహి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు సతీమణి అయిన సత్యప్రభ.. ఆయన మృతితో రాజకీయాల్లోకి వచ్చారు.
2014 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో రాజంపేట అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే సత్యప్రభ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికయ్యారు. సత్యప్రభ మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. సత్యప్రభ మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని కి పాజిటివ్..!
ఏపి మంత్రి పేర్ని నాని ఇంట విషాదం!