- Advertisement -
ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లను రద్దు చేయలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీనిపైన ముందు హైకోర్టును సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఓటు వేయడం ప్రాథమిక హక్కని, ఈవీఎంల వినియోగం వల్ల ఆ హక్కుకు భంగం కలుగుతుందన్న పిటిషనర్ వాదనను తప్పుపట్టింది న్యాయస్థానం. ఈ పిటిషన్ను ఉపసంహరించకోవాలని ఆదేశించింది.
సామాజిక మాధ్యమాలపై నియంత్రణ ఉండేలా చర్యలు చేపట్టాలంటూ సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. పార్లమెంటులో ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టే వరకు సోషల్ మీడియాపై నియంత్రణ ఉండేలా మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. ట్విట్టర్ అన్ని విధాలా ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు.
భూమ అఖిల ప్రియకు బెయిల్ వచ్చేనా?