Tuesday, April 30, 2024
- Advertisement -

వాళ్లిద్దరిలో ‘మెగా’ ఛాన్స్ ఎవరికి?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయాల‌ను పూర్తిగా వ‌దిలేసి వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆచార్య ఇప్ప‌టికే పూర్తి కావ‌డానికి వ‌చ్చింది. ఆ త‌ర్వాత వెంటనే మరో రెండు సినిమాలు చేసేందుకు ఇప్ప‌టికే ఓకే చెప్పేశారు. అందులో మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్ ఒకటైతే, వేదాళం తమిళ సినిమా రీమేక్ ఇంకోటి.

లూసిఫర్ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. వేదాళం కు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే మ‌రో సినిమాకు కూడా చిరంజీవి ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇది దర్శకుడు బాబీ తీస్తున్నాడు. బాబీ చెప్పిన కథ న‌చ్చ‌డంతో చిరంజీవి ఓకే చెప్పార‌ట‌. ఈ విషయాన్ని ఈ మ‌ధ్య ఆయ‌నే చెప్పాడు.

ఈ సినిమా అప్డేట్ అప్పుడే వ‌చ్చేసింది. అదేమిటంటే, ఇందులో హీరోయిన్ గా శ్రుతి హాసన్ కానీ, రకుల్ ప్రీత్ సింగ్ కానీ ఉండే అవ‌కాశం ఉంది. వీరిద్ద‌రిలో ఎవ‌రు ఓకే అవుతార‌నేది త్వ‌ర‌లో తేల‌నుంది. మే నెల నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంద‌ట‌. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని ఇవ్వ‌నున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది.

Also Read

మ‌రోసారి గోపిచంద్ తో రాశిఖ‌న్నా రోమాన్స్ !

వ‌ర్మను క‌లిసిన బిగ్ బాస్ హాట్ బ్యూటీ!

చలికాలంలో రోజూ స్నానం చేస్తున్నారా? అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -