ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతారు. కొందరు తమ టాలెంట్ ను నిలబెట్టుకోలేక వెనుదిరుగుతుంటే.. మరికొందరు తమ సత్తాను చాటుకుంటూ.. ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. అందులో ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ తన హవాను లోకానికి చాటుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ శరత్ కుమార్ కూతురిగా చిత్ర సీమలో అడుగుపెట్టింది.
హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో.. రూటు మార్చి విలన్ గా మారిపోయి తన అసలైన నటనను బయటపెట్టింది. మాస్ మహారాజా ‘క్రాక్’ సినిమాలో జయమ్మగా విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడు. దీంతో పాటుగా అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘నాంది’ సినిమాలో లాయర్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బ్యాక్ టూ బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు డైరెక్టర్ల నుంచి అవకాశాలు వెళ్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్, కొరటాల శివ కాంబోలో ఈ అమ్మడు ఓ కీలక పాత్రలో నటించనుందని వార్తలు వచ్చాయి. దీంతో పాటుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అయినను పోయిరావలె హస్తినకు’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందట జయమ్మ. అది కూడా పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో ఈ అమ్మడు కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !
ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?