Monday, May 6, 2024
- Advertisement -

మళ్లీ తెరపైకి గాలి జనార్దన్​రెడ్డి.. ఈసారీ ఎన్ని కోట్లు అంటే..!

- Advertisement -

గాలి జనార్దన్​రెడ్డి బెయిల్ షరతుల సడలింపు పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గాలి జనార్దన్​రెడ్డి వేసిన పిటిషన్​పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. బళ్లారి, అనంతపురం, కడప వెళ్లకూడదన్న షరతులను సడలించాలని.. గాలి జనార్ధన్​రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2015 నుంచి ఇప్పటివరకు షరతులు ఉల్లంఘించలేదని ధర్మాసనానికి తెలిపారు. కుటుంబ సభ్యులు బళ్లారిలో ఉన్నారని.. అక్కడకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని గాలి జనార్దన్​రెడ్డి.. సుప్రీంకోర్టును వేడుకున్నారు.

గాలి జనార్దన్​రెడ్డి బెయిల్ షరతులను సడలించవద్దని సీబీఐ వాదించింది. బళ్లారిలో చాలామంది సాక్షులు ఉన్నారనీ.. జనార్దన్​రెడ్డి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం.. తీర్పును రిజర్వు చేసింది.

అమ్మవారి ముందు భారీ అవినీతి.. బయటకి వచ్చిన భాగోతం..!

పవన్‌ కళ్యాణ్ ఒక వ్యసనం.. నవ్వులు పూయిస్తున్న బండ్ల గణేశ్‌ స్పీచ్‌

కొండెక్కిన కోడి.. క‌రోనానే కార‌ణ‌మా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -