ఇటీవల దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత బీభత్సం కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే గత ఏడాది కరోనా ని కట్టడి చేయడానికి ఎలాంటి వ్యాక్సిన్ రాలేదు.. కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలైంది. కొన్ని చోట్ల వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా కరోనా భారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగా గురు రామ్ దేవ్ బాబా అలోపతి మందులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఐఎంఏ ఆగ్రహానికి గురయ్యారు. అల్లోపతి వైద్యం, డాక్టర్లపై చేసిన వ్యాఖ్యలతో సర్వత్రా నిరసన వ్యక్తం కావడంతో యూటర్న్ తీసుకున్నాడు. వైద్యుల్ని దైవదూతలతో పోల్చుతున్నారు. తన పోరాటం వైద్యులపై కాదని.. మాదక ద్రవ్యాల మాఫియాపై అంటూ ప్రకటించారు. హరిద్వార్లో విలేకరులతో మాట్లాడుతూ.. త్వరలోనే తాను కూడా వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పారు.
టీకాలు అందరికీ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనను రామ్దేవ్ బాబా స్వాగతించారు. ప్రజలంతా టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు టీకా రెండు డోసులు తీసుకోవాలని కోరారు. . ఔషధాల పేరుతో ప్రజలను దోపిడీ చేయడాన్నే తాను వ్యతిరేకిస్తాను తప్పితే తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని యోగా గురు స్పష్టం చేశారు.
చెర్రీతో మాళవికా మోహనన్ రొమాన్స్..!
తమిళనాట చిన్నమ్మ ప్రకంపనలు.. నన్ను పార్టీ నుంచి ఎవరూ దూరం చేయలేరు..!