మెగాస్టార్ చిరంజీవి ఎంత సంయమనంతో ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ కొంచెం ఆవేశపరుల్లా కనిపిస్తారు కానీ.. చిరు మాత్రం సాప్ట్ గానే కనిపిస్తారు. అయితే యంగ్ గా ఉన్న టైంలో ఆయనకు కోపం కొంచెం ఎక్కువ ఉండేదట. ఆ కోపంలోనే నాగబాబుని కొట్టడట చిరు.
ఈ సంగతిని ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో సందర్భంగా చిరు ముందు కూర్చుని నాగబాబే స్వయంగా చెప్పాడు. నాగబాబు మామూలుగా చాలా బద్దకిస్తు అట. చిరు మాత్రం చాలా చురుగ్గా ఉండేవాడట. ఇంట్లో పనులన్నీ కూడా చిరునే చేసేవాడట. ఏ పని చెప్పిన నాగబాబు అసలు చేసేవాడు కాదట. నిద్రపోతు టైం వృథ చేసేవాడట. అయితే ఓ సారి చిరు.. లాండ్రికి ఇచ్చిన బట్టలు తీసుకురమ్మని చెప్పి పని మీద బయటకు వెళ్లాడట. తిరిగి వచ్చేసరికి నాగబాబు నిద్రపోతు కనిపించాడట. దీంతో చిరుకు కోపం వచ్చి నాలుగు తగిలించాడట.
అంతలో చిరు తల్లి వచ్చి.. చిన్నోడిని ఎందుకురా కొడతావు అంటూ తిట్టిందట. దీంతో చిరుకు ఏడుపొచ్చి.. తండ్రి రాగానే విషయం చెప్పగా.. ఆయన మళ్లీ నాగబాబును వాయించాడట. అన్నదమ్ములిద్దరూ.. ’మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో ఈ ఎపిసోడ్ గురించి చెప్పుకుని నవ్వుకున్నారు. అన్నయ్య సినిమాల్లోకి రావడానికంటే ముందు తమ ఊర్లో మంచి ఫాలోయింగ్ ఉండేదని.. ఎప్పుడు చుట్టూ పది మంది ఉండేవారని.. ఆ రకంగా అప్పుడే తనకు తన అన్నయ్య స్పూర్తిగా నిలిచాడని నాగబాబు ఈ షోలో తెలిపాడు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related