ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను రిలీజ్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు. మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా.. వీరిలో 4,98,585 మంది విద్యార్థులు (81.14శాతం) ఉత్తీర్ణత సాధించారు.
బాలురు 78.31శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 84.09శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వందశాతం ఫలితాలు రాగా.. 19పాఠశాలల్లో ఎవ్వరూ పాస్ కాలేదు.
93.90 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం అగ్రస్థానంలో ఉండగా ఆ తరువాత స్థానంలో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 91.43శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 89.14శాతంతో మూడో స్థానంలో విశాఖపట్టణం ఉండగా చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 47.64శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.