చాలామంది తెలియకుండానే ఒక అలవాటులో పడిపోతారు — ఉదయం బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వడం, మధ్యాహ్నం భోజనం ఆలస్యంగా చేయడం, చివరికి రాత్రి ఎక్కువగా తినడం. మొదట్లో ఇది సాధారణంగా అనిపించినా, కాలక్రమంలో ఇది శరీర మెటాబాలిజంపై ప్రభావం చూపుతుంది.
భోజనం స్కిప్ చేయడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు అసమతుల్యంగా మారుతాయి.ఆకలి నియంత్రణ తప్పుతుంది.తరువాత ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది.
మొదట్లో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినా, తరువాత అకస్మాత్తుగా పెరిగి పడిపోవడం జరుగుతుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్-2 డయాబెటిస్కు దారితీయొచ్చు.
రాత్రి సమయానికి శరీరం గ్లూకోజ్, ఫ్యాట్ను మెటబలైజ్ చేసే సామర్థ్యం తగ్గుతుంది. తీసుకున్న కేలరీలు ఫ్యాట్గా నిల్వ అవుతాయి.బరువు పెరుగుతుంది.ఒబెసిటీ, మెటాబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుంది.
రాత్రి భారీగా తినడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది.ఆకలి నియంత్రించే హార్మోన్లు (గ్రెలిన్, లెప్టిన్) ప్రభావితమవుతాయి.ఉదయం అలసటగా, రోజంతా ఆకలిగా అనిపిస్తుంది.
భోజన అలవాట్లలో మార్పులు లేకపోతే కడుపు ఉబ్బరం, అసౌకర్యం.గట్లో సూక్ష్మజీవుల సమతుల్యతలో మార్పులు,ఇన్ఫ్లమేషన్ మరియు ఇతర మెటాబాలిక్ సమస్యలకు దారితీస్తాయి.
మనము ఏమి తింటామన్నదానికంటే, ఎప్పుడు తింటామన్నది కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. సమయానికి భోజనం చేయడం వల్ల:
మెటాబాలిజం సరిగా పనిచేస్తుంది
శరీరానికి స్థిరమైన ఎనర్జీ లభిస్తుంది
బ్రేక్ఫాస్ట్ను ఎప్పుడూ స్కిప్ చేయవద్దు
భోజన సమయాలను క్రమబద్ధంగా ఉంచండి
రాత్రి ఆలస్యంగా భారీగా తినడం మానండి
రోజంతా సమాన విరామాల్లో భోజనం చేయండి.
