మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 తర్వాత భారీ స్థాయి సినిమా చేస్తున్నారు. ఆ సినిమానే ‘సైరా.. నరసింహారెడ్డి’. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. ముఖ్యమంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తప్పుకున్నారని రూమర్స్ వచ్చాయి. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్పై తనయుడు, నటుడు రామ్చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. సంక్రాంతి పండుగ రావడంతో షూటింగ్కు కాస్త విరామం ప్రకటించారు. త్వరలోనే రెండో షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. నరసింహారెడ్డికి గురువు పాత్రను అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నారు.
ఈ విషయాన్ని దర్శకుడు సురేందర్రెడ్డి ఫొటోతో కన్ఫార్మ్ చేసుకోవచ్చు. అమితాబ్తో సురేదర్రెడ్డి ఓ ఫొటో దిగి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోతో ‘సైరా’లో అమితాబ్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఫొటోతో పుకార్లకు ఫుల్స్టాప్ పడినట్టే. ప్రస్తుతం ఈ సినిమాలో చిరంజీవి, అమితాబ్లతో పాటు, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా సంగీత దర్శకుడి పేరు ఖరారు కాలేదు. చారిత్రక నేపథ్యంలో తీస్తున్న ‘సైరా’ను భారీస్థాయిలో సినిమాను విడుదల చేయాలని రామ్చరణ్ ప్లాన్.