రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రాంచరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. రాంచరణ్ తరువాత ఈ సినిమాలో రంగమ్మ అత్తగా చేసిన అనసూయకే చాలా మంచి పేరు వచ్చింది.రంగమ్మ అత్తగా అందరిని మెప్పిచింది అనసూయ.1980లో పల్లెటూరు కథను దర్శకుడు సుకుమార్ అందంగా చూపించారు.సినిమా రీలిజ్ అయి నేటికి యాభై రోజులైంది.
ఇప్పుడు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ పెట్టారు.దీంతో అనసూయ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ చూస్తు తన ట్వీట్టర్ అంకౌట్లో పోస్ట్ చేసింది.దీనిని చాలమంది తప్పుగా అర్థం చేసుకుని అనసూయ రంగస్థలం సినిమా పైరసీ చూస్తుందని కామెంట్స్ చేశారు.ఆ ఫోటోలో రంగమ్మత్తకు రివర్సులో ఉంది అనసూయ. స్లీవ్ లెస్ టాప్ లో కళ్లకి స్టైలిష్ గాగుల్స్ తో ఏదో తింటూ సినిమా చూస్తోంది.