- Advertisement -
ముంబయిలోని వర్లి ప్రాంతంలోని 45 అంతస్తుల ఓ వాణిజ్య సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అబ్బాసాహేబ్ మరాఠే మార్గ్లో ఉన్న భీముండే టవర్స్లోని 33వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్చలు ప్రారంభించారు. బిల్డింగ్లో ఉన్న 95 మందిని కాపాడామని, మంటలనార్పడానికి 8 ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయని తెలిపారు అధికారులు.
ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఇళ్లు కూడా ఇదే భవనంలో ఉందని సమాచారం. దీపికా ఈ భవనంలోని 26వ అంతస్తులో ఉంటున్నట్లు సమాచారం.అయితే ప్రమాదం జరిగింది దీపిక ఉన్న అపార్ట్మెంట్లో కాదని, ఆ సమయంలో దీపిక కూడా అక్కడ లేదని ఆమె సన్నిహితులు మీడియాకు తెలిపారు.