2007 ఆగస్ట్ 25వ తేదీన గోకుల్ చాట్, లుంబినీ పార్కులలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఇద్దరు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సోమవారం ఎన్ఐఏ ప్రత్యోక కోర్టు సంలచన తీర్పును ఇచ్చింది. ఈ కేసులో ఏ1, ఏ2 అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీక్ షఫీద్ సయ్యద్లను న్యాయస్థానం నేరస్తులుగా తేల్చింది. ఇందులో మొదటి ఇద్దరు నేరస్తులకు ఉరిశిక్ష విధించింది. మూడో నేరస్తుడు తారిఖ్ అంజుమ్కు యావజ్జీవ శిక్ష విధించింది.
ఈ కేసులో ఆధారాలు లేవంటూ మరో ఇద్దరిపై కేసులను కోర్టు కొట్టివేసింది. నాంపల్లి అదనపు సెషన్స్ జడ్జి చర్లపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో .. నాంపల్లి అదనపు మెట్రో సెషన్స్ జడ్జి ఈ తీర్పును సోమవారం నాడు వెల్లడించారు.
2007 ఆగష్టు 25వ, తేదీ రాత్రి 7.45 నిమిషాల సమయంలో తొలుత లుంబిని పార్క్లో , ఆ తర్వాత గోకుల్ చాట్లో పేలుళ్లు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనల్లో సుమారు 44మంది మృతి చెందగా, మరో 50 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనకు ఇండియన్ ముజాహిద్దీన్ కారణంగా ఎన్ఐఏ నిర్దారించింది.
ఈ కేసులో నిందితులైన అక్బర్, అనీఖ్, అన్సార్ను పోలీసులు 2008 అక్టోబర్లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 2009లో హైదరాబాద్కు తీసుకువచ్చి ఇక్కడి కోర్టులో హాజరుపరిచారు. పేలుళ్లు జరిపింది తామేనని వారు అంగీకరించారు. ఈ కేసులో నిందితులైన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఫరూఖ్ ఫార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్. రియాజ్, ఇక్బాల్, ఫరూఖ్ పార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్ పరారీలో ఉన్నారు.
ఈ ఘటనకు సంబంధించి 11 మందికిపై ఎన్ఐఏ 1125 పేజీల చార్జీషీట్ దాఖలు చేసింది. వీరిలో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఇద్దరు రియాజ్ భత్కల్ తో పాటు యాసిన్ భత్కల్ మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు.