అక్రమ సంబంధం హత్యకు దారితీసింది. ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి అతడి రహస్యంగా పెల్లి చేసుకొని అతని భార్యను అతని చేతనే హత్య చేయించింది. ఈ సంఘటన హరియాణా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో చోటుచేసుకుంది.
గురుగ్రామ్ వ్యాలీ వ్యూ ఎస్టేట్ అపార్ట్మెంట్లో విక్రమ్ సింగ్ చౌహాన్, దీపిక దంపతులు నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతంలో ఉండే షెఫాలీ భాసిన్ తివారీ (35) అనే మహిళతో విక్రమ్కు పరిచయం ఏర్పడింది. అది క్రమంగా అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరి అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న దీపిక భర్తను నిలదీసింది. ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అయితే గొడవ పడిన విషయం షెఫాలీకి మెసేజ్ పెట్టాడు. వెంటనే స్పందించిన ఆమె.. దీపికను వాళ్లు నివాసముంటున్న 8వ అంతస్తు నుంచి తోసేయాలని సూచించింది. ఆ సలహా నచ్చడంతో ముందువెనుక ఆలోచించకుండా దీపికను అపార్ట్ మెంట్ 8వ అంతస్తు నుంచి విక్రమ్ తోసేశాడు. అక్కడి కక్కడే దీపిక మృతి చెందింది. ఆత్మహత్య చేసుకుందని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే విక్రమ్ ప్రవర్తనను అనుమానించిన పోలీసులు అతని కాల్ డేటా, మెసేజ్ ను పరిశీలించగా, షెఫాలీతో కలసి దీపిక హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. దీంతో షెఫాలీతో కలసి దీపిక హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. దీంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం షెఫాలీ ఆరు నెలల గర్భవతిగా వైద్యులు గుర్తించారు.